WGL: పర్వతగిరి మండల కేంద్రంలో ఎస్టీ బాలుర వసతి గృహంలో ఎర్త్ అవర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజ్వల్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్ చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సర్పంచ్ చిదురు శంకర్ విద్యుత్ ఆదా, చెట్లు నాటడం, నీటి సంరక్షణపై ప్రజలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.