MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన గణపురం రామస్వామి అనే రైతు ఎండ తీవ్రతను తట్టుకోలేక హెల్మెట్ ధరించి తన వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే సమయంలో జిల్లా పోలీస్ శాఖ హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుండడం గమనార్హం.