• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధికి కృషి

MNCL: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో మంచిర్యాల నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి సారించి రోడ్ల విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా డివిజన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరుస్తామని, శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటుకు త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు.

February 20, 2026 / 10:20 AM IST

‘గరుడాచలం మృతి RSS, BJPకి తీరని లోటు’

ASF: RSS, వనవాసి కళ్యాణ పరిషత్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన వాడపల్లి గరుడాచలం మృతి RSS, BJPకి తీరని లోటని MLA హరీష్ బాబు అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణం ఆదర్శనగర్‌లో గరుడాచలం అనారోగ్యంతో మృతి చెందారని తెలిసి ఆయన నివాసంలో పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

February 20, 2026 / 10:15 AM IST

ముత్యంపేటలో అక్రమ కట్టడాల కూల్చివేత

KMR: దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను గురువారం సాయంత్రం అధికారులు కూల్చి వేశారు. ఓ నాయకుడు గ్రామంలో అక్రమ కట్టడాన్ని రాజకీయ పలుకుబడితో కట్టడంతో అధికారులు సైతం వెనుకంజ వేశారు.అయినప్పటికీ హైకో ర్టు అడ్వకేట్ ముందుకు వచ్చి పోలీసులు అధికారులతో కలిసి అక్రమ కట్టడాన్ని కూల్చివేయించారు.

February 20, 2026 / 10:15 AM IST

నేటి పత్తి ధర వివరాలు..!

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,000గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.

February 20, 2026 / 09:59 AM IST

ఎక్స్‌ప్లోజర్ విజిట్‌కు విద్యార్థులు

SRD: సిర్గాపూర్ పీఎం పాఠశాతకు చెందిన విద్యార్థులు ఎక్స్‌ప్లోజర్ విజిట్ ఇండస్ట్రియల్ టూర్‌‌‌‌‌‌‌‌కు వొకేషనల్ విద్యార్థులు 50 మంది శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ICT గూగుల్ మైక్రోసాఫ్ట్ గచ్చిబౌలి (బాయ్స్), బ్యూటీ అండ్ వెల్నెస్ అను హెర్బల్ ఇండస్ట్రీ సుల్తాన్పూర్ ( గర్ల్స్) లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్లు PD తెలిపారు.

February 20, 2026 / 09:51 AM IST

చెరువులో నీటి కుక్క ప్రత్యక్షం

SRPT: పెన్‌పహాడ్ మండలంలోని ధర్మాపురం గ్రామంలో శుక్రవారం వింత ఘటన చోటుచేసుకుంది. స్థానిక మధిరామక్క చెరువులో నీటి కుక్క కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఉదయాన్నే ఈ వింత జీవిని చూసిన యువకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వార్త వైరల్‌గా మారింది. సముద్రాల్లో ఉండే జంతువు తమ చెరువులో కనిపించడంతో జనం ఎగబడ్డారు.

February 20, 2026 / 09:44 AM IST

రోడ్డు విస్తరణ సెగ.. నేరడలో బాధితుల ఆందోళన

NLG: చిట్యాల మండలం నేరడలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వద్ద నిధులు లేవని అధికారులు చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు అండగా ఉంటామని బీజేపీ నేత శంకరాచారి పేర్కొనగా, ఇందిరమ్మ ఇళ్ల హామీపై బాధితులు అసహనం వ్యక్తం చేశారు.

February 20, 2026 / 09:40 AM IST

జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు..!

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈవో రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

February 20, 2026 / 09:37 AM IST

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేత

NRPT: ఊట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామ ప్రతినిధులు నారాయణపేట విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ నవీన్‌ను కలిసారు. తక్కువ వోల్టేజ్, లూజ్ లైన్లు, కర్రలపై విద్యుత్ లైన్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్. నర్సిములు, భారతీయ కిసాన్ సంఘం నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు  పాల్గొన్నారు.

February 20, 2026 / 09:36 AM IST

జిల్లాలో అరుదైనా ఉడుత

VKB: జిల్లాలో ఒక అరుదైన పెద్ద ఉడుత (Malabar Giant Squirrel) కనిపించింది. కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి, అమ్రాబాద్ అడవిలో తన పరిశోధనలో భాగంగా దీనిని గుర్తించారు. దీనిని శాస్త్రీయంగా రాటుఫా ఇండికా అని పిలుస్తారు. ఇది సుమారు 3 అడుగుల పొడవు, వివిధ రంగులు కలిగి ఉంటుందని తెలిపారు.

February 20, 2026 / 09:35 AM IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను కలిసిన పీయు ఉపకులపతి

MBNR: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మను పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి జీఎన్ శ్రీనివాస్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండల చైర్మన్ బాల కిష్టారెడ్డి, ఇతర యూనివర్సిటీల ఉపకులపతులు ఉన్నారు.

February 20, 2026 / 09:34 AM IST

ఈ నెల 22న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం TG-సెట్

MNCL: ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతి, 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 22న TG-సెట్ నిర్వహించనున్నట్లు కాసిపేట బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 09:33 AM IST

బాల్య వివాహ విముక్తి ప్రచార రథం ప్రారంభం

BHNG: వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లాలో బాల్య ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని భువనగిరి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

February 20, 2026 / 09:33 AM IST

పుస్తెల తాడు దొంగిలించిన యువకుల అరెస్ట్

NLG: మునుగోడు మండలం పలివెలలో చింతకాయలు తెంచుతున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు దొంగిలించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మాద నరేందర్, వల్లెపు సాయిల నుంచి బంగారు గొలుసు, కారు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ రవిని డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు.

February 20, 2026 / 09:28 AM IST

‘రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ కేవైసీ తప్పనిసరి’

KNR: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొత్తగా కార్డులు పొందినవారు, పాత కార్డుల్లో పేరు జత చేసుకున్నవారు ఈ-కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. మీ సమీపంలోని రేషన్ దుకాణంలో e-PoS యంత్రంలో ఉచితంగా చేయించుకోవచ్చని వెల్లడించారు.

February 20, 2026 / 09:26 AM IST