ADB: వినియోగదారుల చట్టాలపై అవగాహనతోనే మోసాల నుంచి రక్షణ పొందవచ్చునని జిల్లా వినియోగదారుల కమిషన్ జడ్జి జబేజ్ శామ్యూల్ అన్నారు. పట్టణంలోని చాందా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరైన ఆధారాలతో జిల్లా కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని శామ్యూల్ కోరారు.