KDP: జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 12 నెలల పూర్తి వేతనం చెల్లించాలని DYFI జిల్లా కార్యదర్శి శివ డిమాండ్ చేశారు. యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి 12 నెలల ఫీజులు వసూలు చేస్తూ, టీచర్లకు మాత్రం 10 నెలల జీతం మాత్రమే ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. వేసవిలో జీతం లేక టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.