NRML: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులను నిర్వహించాలని, పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలలకు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు.