KMR: నిజాంసాగర్ మండలం వెల్గనూరు గ్రామ పంచాయితీ పరిధిలో ఆదివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, వారికి PPE కిట్లను అందజేశారు. గ్రామ సర్పంచ్ సాదుపల్లి సువర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొని, పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసించారు.