KKD: పిఠాపురం పాదగయ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (POLYCET) అభ్యర్థులకు ఆదివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కె. మాణిక్యరావు శనివారం తెలిపారు. ఈ నెల 25న జరిగే పరీక్షకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.