WGL: నర్సంపేటలో దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేఏసీ కన్వీనర్ డా. గద్ద వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయా సాధన కోసం యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.