GDWL: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహనీయుల అడుగుజాడల్లో నడవడమే మనం వారికి ఇచ్చే నిజమైన గౌరవమని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.