SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువుకు గోదావరి ఎల్లంపల్లి నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి, పీసీసీ సభ్యులు గడ్డం శ్రీనివాస్, దయ్యాల శీను తదితరులు కాల్వను సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. చాలా కాలం తర్వాత సాగునీరు విడుదల కావడంతో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు.