KNR: గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ పట్నాల ఉత్సవాలు చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు మహిళలు పోచమ్మ బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల్లు, శివ సత్తుల పునకాలతో ఊరేగింపుగా వెళ్లారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.