BHPL: భూతగాడ నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో గొర్లవీడు గ్రామానికి చెందిన మామిడి రాజకుమార్, అతని భార్య రమను దోషులుగా నిర్ధారించిన జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులిద్దరికీ ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా ఇద్దరికీ చెరో రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 10 వేల జరిమానా విధించినట్లు ఇవాళ SP సంకీర్త్ తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను MLA పాయల్ శంకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో స్రవంతితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రనమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
NLG: దేవరకొండ ఆర్డీవో కార్యాలయం ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే రూ.8500 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
KMR: రామారెడ్డి PHC నీ ఆహార భద్రతా కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన వెంట DMHO డా.విద్య ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల, బాలింతల పట్ల తీసుకుంటున్న చర్యలు, ఆరోగ్య శాఖ సమన్వయంతో అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీషన్ ఫుడ్ అందిస్తున్న సేవల వివరాలపై ఆరా తీశారు.
పెద్దపల్లికి చెందిన ఓ మహిళ (33)కు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అండాశయం ఎడమవైపు భాగంలోని డెర్మాయుడు సిస్ట్ తొలగించినట్లు సూపరింటెండెంట్ డా. శ్రీధర్ తెలిపారు. సర్జరీలో పాల్గొన్న వైద్య బృందం డాక్టర్లను ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను పేద ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
MDK: శివంపేట మండలంలోని కొత్తపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధి, పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
BDK: ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట కార్యక్రమంలో కుటుంబ సమేతంగా శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. స్వామివారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రామయ్య ఆశీస్సులు అందరిపై ఉండే సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
GDWL: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే జరిగిందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డా.ఆంజనేయ గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల్లో వ్యక్తిగత నిర్ణయాలకు చోటు లేదని ఆయన తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం సోషల్ మీడియాలో అనవసర వాదోపవాదాలు సరికాదని హితవు పలికారు.
VKB: పర్యాటక ప్రాంతమైన అనంతగిరి క్షేత్రానికి వస్తున్న సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యేకంగా రెండు సఫారీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులు ఈ వాహనాల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణించి ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
PDPL: ఓదెల మండలంలోని గుండ్లపల్లి, సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామాల్లో ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను సేవా కేంద్రాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను సంబంధిత కాంగ్రెస్ నాయకులు నిర్వాహకులు సన్మానించారు.
MDK: రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయ అధికారి స్రవంతి సూచించారు. శుక్రవారం మండలంలోని కొనాయిపల్లిలో రైతు తప్పేట సాయిబాబా వెదజల్లే పద్ధతిలో వేసిన వారి నాటును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు విభిన్న పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నారు.
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బండమీదిగూడెంలో నిన్న రాత్రి ఘోరం జరిగింది. గంజాయి మత్తులో ఓ కిరాతక కొడుకు కన్నతండ్రినే కడతేర్చాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర సత్తయ్య(60), తన కుమారుడు బాలకృష్ణ (34) మధ్య కుటుంబ విషయాల్లో తగాదా మొదలైంది.ఆగ్రహంతో మత్తులో ఉన్న బాలకృష్ణ తండ్రిని కర్రతో కొట్టడంతో సత్తయ్య మృతి చెందాడు.
HYD: గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న HYDలో ‘పార్కింగ్’ సమస్య ఇప్పుడు సగటు జీవికి శాపంగా మారింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులు లేవు. ఉన్నచోట అక్రమ వసూళ్లు దడ పుట్టిస్తున్నాయి. అటు అధికారులు, ఇటు ప్రైవేట్ యాజమాన్యాల మధ్య సమన్వయ లోపం సామాన్యుడికి శాపంగా మారుతోంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు GHMC స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
SRD: కాంప్లెక్స్ సమావేశాలు విద్యార్థుల ప్రగతికి నాంది కావాలని కొండాపూర్ ఎంఈవో దశరథ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తొగర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిరి పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని తరగతి గదుల్లో విద్యార్థులకు సులభమైన రీతిలో బోధించాలని సూచించారు. గుణాత్మక విద్యను అందించాలన్నారు.
వనపర్తి జిల్లా నర్సింగయ్య పల్లి డిగ్రీ కాలేజ్ వద్ద శుక్రవారం ఉదయం రెండు బైకులు ఢీ కొని ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని సరైన సమయంలో అంబులెన్స్ అందుబాటు లేకపోవడంతో గతంలో గోపాల్పేట ఎస్సైగా విధులు నిర్వహించిన నరేష్ తన బైక్పై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు శభాష్ పోలీస్ అని కొనియాడారు.