• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భద్రాద్రిలో వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

BDK: భద్రాద్రి క్షేత్రంలో రామయ్య నిత్య కళ్యాణం వేడుక సోమవారం కనులవిందుగా సాగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం అనంతరం శాస్త్రోక్తంగా కంకణధారణ యజ్ఞోపవీత ధారణ గావించి నిత్య కళ్యాణం జరిపించారు.

March 16, 2026 / 10:52 AM IST

‘పెండింగ్ విద్యుత్ బిల్లుల వసూలుపై ప్రత్యేక దృష్టి’

GDWL: కేటిదొడ్డి మండలంలో గృహ జ్యోతి పథకం వర్తించని వినియోగదారుల నుంచి పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లుల వసూలును అధికారులు వేగవంతం చేశారు. మండల ఏఈ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు లైన్‌మెన్ మునిస్వామి సోమవారం రికవరీ చేపట్టారు. విద్యుత్ వినియోగదారులు బకాయిలను వెంటనే చెల్లించి శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.

March 16, 2026 / 10:51 AM IST

NIT వరంగల్‌లో రెండు రోజులు అంతర్జాతీయ సదస్సు

WGL: ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ వేదికగా ‘సెక్యూరిటీ అండ్ ప్రైవసీ’ (ICSP 2026) అంశంపై 5వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నవంబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. డిజిటల్ యుగంలో సమాచార భద్రత, గోప్యతలో ఎదురవుతున్న సవాళ్లు, సైబర్ థ్రెట్స్‌‌పై ప్రపంచవ్యాప్త పరిశోధకులు, నిపుణులు చర్చించనున్నారు.

March 16, 2026 / 10:49 AM IST

ఖానాపురంలో పరిశుభ్రత కార్యక్రమం

SRPT: అనంతగిరి మండలం ఖానాపురంలో 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో చెత్తను బయట పడేయకుండా గ్రామపంచాయతీ ట్రాక్టర్లలో మాత్రమే వేయాలని సర్పంచ్ కంటు లాజర్ సూచించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా గ్రామ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని గ్రామస్థులకు తెలిపారు.

March 16, 2026 / 10:45 AM IST

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్నస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి వారం భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. భక్తులు గంగిరేణు చెట్టువద్ద ముడుపులు, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ అధికారులు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.

March 16, 2026 / 10:44 AM IST

మధ్యాహ్న భోజన కార్మికుల ముందస్తు అరెస్ట్

SRCL: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కుకు ధర్నాకు వెళ్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను ఇల్లంతకుంట పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టును కార్మికులు తీవ్రంగా ఖండించారు. వారు మాట్లాడుతూ.. మధ్యాహ్నం భోజనం కార్మికులకు రూ.10,000 జీతం ఇస్తామని చెప్పినా, కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. అరెస్ట్ అయిన వారిలో రేణుక, దేవక్క, వసంత, సుశీల ఉన్నారు.

March 16, 2026 / 10:42 AM IST

వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: AEO

BHPL: గోరికొత్తపల్లి (M) నిజాంపల్లి గ్రామపంచాయతీ వద్ద సోమవారం AEO ప్రశాంత్ ఆధ్వర్యంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. AEO మాట్లాడుతూ.. రైతులు తక్షణమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయకపోతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు, పథకాలు, రుణ మాఫీ, యంత్రాల సహాయం వంటివి పొందలేరని హెచ్చరించారు.

March 16, 2026 / 10:40 AM IST

ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్

MDK: రామాయంపేట మండలం సుతార్ పల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని సోమవారం గ్రామ సర్పంచ్ సునీల్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 16, 2026 / 10:39 AM IST

ఈనెల 19న శంకర్ లొద్ది మహా పాదయాత్ర

ADB: నార్నూర్ మండలం కొత్తపల్లి బంజారా దీక్షా భూమి పీఠాధిపతి ప్రేమ్ సింగ్ మహారాజ్ తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం శంకర్ లొద్దికి ఈనెల 19న మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు దేవేందర్ రాథోడ్ తెలిపారు. సేవాలాల్ దీక్షాపరులు, భక్తులు ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు.

March 16, 2026 / 10:36 AM IST

గ్యాస్ సిలిండర్ పేరిట కొత్త మోసం: ఎస్పీ

NGKL: LPG గ్యాస్ బుకింగ్, డెలివరీ పేరుతో వచ్చే నకిలీ వాట్సాప్, SMS లింక్‌లను క్లిక్ చేయవద్దని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ వివరాలు, OTPలు అడిగి నగదు కాజేస్తున్నారని, అనుమానాస్పద లింక్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

March 16, 2026 / 10:35 AM IST

రోడ్డు పక్కన మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు

SRD:  సిర్గాపూర్ మండల కేంద్రంలోని వైన్స్ వద్ద బహిరంగ ప్రదేశంలో కూర్చొని మద్యం సేవిస్తున్న మందుబాబులను ఎస్సై  నారాయణ ఆదివారం పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశంలో కూర్చొని మద్యం సేవించడం నేరమని, వైన్స్ పరిసరాల్లో బహిరంగంగా మద్యం సేవించకుండా చూడాల్సిన బాధ్యత వైన్స్ యాజమాన్యానిదేనన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని SI హెచ్చరించారు.

March 16, 2026 / 10:35 AM IST

దిన వారసంతల డిపాజిట్ సేకరణ ప్రారంభం

MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో నిర్వహించే దిన, వార సంతల వేలంపాట డిపాజిట్ స్వీకరణను స్థానిక ఈవో రాహుల్ ప్రారంభించారు. 2026-27 సంవత్సరానికి వేలంపాటను సోమవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పలువురు ముందుకు వచ్చి దిన సంతకు రూ.10 వేలు, వారసంతకు రూ.20 వేలు డిపాజిట్ చెల్లిస్తున్నారు. సాయంత్రానికి వేలంపాట పూర్తవుతుందని తెలిపారు.

March 16, 2026 / 10:32 AM IST

‘విద్యార్థులను సమయానికి పాఠశాలకు పంపాలి’

MNCL: తల్లిదండ్రులు విద్యార్థులను సమయానికి పాఠశాలలకు పంపాలని స్థానిక ఎంఈఓ శైలజ సూచించారు. సోమవారం లక్షెట్టిపేట్ మండలంలోని క్లబ్ రోడ్డు ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్ఎల్ఏస్ ఎగ్జామ్‌లో విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచేలా ఉపాధ్యాయులు సిద్ధం చేయాలన్నారు.

March 16, 2026 / 10:32 AM IST

‘విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు’

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా కేంద్రంలోని వెనుకబడిన,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలోని పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వార్డెన్లను ఆదేశించారు. బాలికల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కామన్ డైట్ మెనూ పాటిస్తూ రుచికరంగా ఆహారం తీసుకోవాలని కోరారు.

March 16, 2026 / 10:31 AM IST

ఘనంగా గంగమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవం

MHBD: మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం గ్రామ శివారు ఆకేరువాగు సమీపంలోని గంగమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత ధర్మకర్త నూకల అభినవ్ రెడ్డి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మతల్లి దీవెనలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు గంగమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

March 16, 2026 / 10:30 AM IST