VKB: దౌల్తాబాద్ మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను సీఎండీ తేజస్వి పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ వినియోగం, రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని, పవర్ సేవింగ్పై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.