SDPT: రీజనల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణంతో భూమి కోల్పోతున్న రైతులకు ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. సోమవారం గజ్వేల్ సమీకృత కార్యాలయ సముదాయంలోని మీటింగ్ హాల్లో జగదేవపూర్ మండలం చేబర్తి, అలిరాజిపేట, పిర్లపల్లి, ఇటిక్యాల గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.