NLG: ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ‘విబిజి రాంజీ’ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నేత కంబాలపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు. కమలాపురంలో ఆయన మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేవని, సాంకేతిక సమస్యలతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని 7 వారాలుగా వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టే చర్యలను విడనాడాలని ఆయన హెచ్చరించారు.