MBNR: పాలమూరు యూనివర్సిటీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మహిళల ఖో-ఖో జట్టు ఎంపికలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. ఎంపికైన వారు మార్చి 26 నుంచి 31 వరకు కర్ణాటకలో జరిగే సౌత్ జోన్ ఖో-ఖో టోర్నమెంట్లో పాల్గొంటారన్నారు.