• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘బిల్లులను విడుదల చేయాలి’

KNR:గంగాధర మండలంలో మాజీ సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరుతూ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో డి.రాముకు పలువురు మాజీ సర్పంచ్‌లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:48 AM IST

పెద్ద చెరువు ప్రాంతంలో పక్షుల సందడి

MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ శివారులో ఉన్న పెద్ద చెరువు వద్ద పక్షులు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఆ చెరువు వద్దకు పలు రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఓరియంటల్ వైట్ ఇబ్బిస్, కామన్ కూట్ వంటి పక్షులు అక్కడకు చేరుకుంటున్నాయి. చెరువు ప్రాంతంలో ఆహారం, నీరు అందుబాటులో ఉండడంతో పక్షులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

February 20, 2026 / 08:45 AM IST

పెద్ద చెరువు ప్రాంతంలో పక్షుల సందడి

MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ శివారులో ఉన్న పెద్ద చెరువు వద్ద పక్షులు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఆ చెరువు వద్దకు పలు రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఓరియంటల్ వైట్ ఇబ్బిస్, కామన్ కూట్ వంటి పక్షులు అక్కడకు చేరుకుంటున్నాయి. చెరువు ప్రాంతంలో ఆహారం, నీరు అందుబాటులో ఉండడంతో పక్షులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

February 20, 2026 / 08:45 AM IST

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం

HYD: జలమండలి ప్రజలతో మమేకమయ్యేందుకు ‘బస్తీ బాట’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి వారానికి నాలుగు రోజులు అమలులో ఉంటుంది. ఈ సందర్భంగా, ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు అధికారులు బస్తీలు, కాలనీల్లో ప్రత్యక్షంగా పర్యటించి నీరు, సీవరేజ్ సమస్యలను గుర్తించి, తక్షణ పరిష్కార చర్యలు చేపడతారు.

February 20, 2026 / 08:43 AM IST

‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు’

SRCL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని 14, 19వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 08:41 AM IST

సౌత్ జోన్ కు బయలుదేరిన పీయూ చెస్ జట్టు

MBNR: సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ చెస్ ఉమెన్స్ టీం బయలుదేరింది. యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ క్రీడాకారులను అభినందించి ట్రాక్ షూట్ మరియు టీం యూనిఫామ్‌లను అందించి క్రీడల్లో మంచి ప్రదర్శన కనబరచాలని కోరారు. రిజిస్టర్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్ర పాల్గొన్నారు.

February 20, 2026 / 08:39 AM IST

‘ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అందుతున్నాయి’

BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకటరావు, గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు శుక్రవారం పాల్వంచలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందుతున్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 08:33 AM IST

రాయల గండికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

NGKL: అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలోని రాయల గండిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని క్రీ.శ 1536లో చింతగుండ రంగారావు నిర్మించారు. ఈ ప్రాంతానికి రంగా రయుని గండి అని పేరు పెట్టగా కాలక్రమేన అది “రాయలగండి” గా ప్రసిద్ధి చెందింది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలో మాల దాసరి వర్గానికి చెందిన వారు పూజలు నిర్వహించడం విశేషం.

February 20, 2026 / 08:33 AM IST

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం : మంత్రి

SRPT: మేళ్లచెరువు మండలంలో జాతర సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా ముగిసింది. ఫైనల్ పోరులో విజయనగరం, వైజాగ్ జట్లు తలపడగా, విజయనగరం జట్టు విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. విజేతకు ట్రోఫీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.

February 20, 2026 / 08:32 AM IST

జనగామ కలెక్టర్‌ను కలిసిన మున్సిపల్ ఛైర్పర్సన్

JN: జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి కలిశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి వెళ్లిన ఆమె, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఆర్డీవో గోపీరాంలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ శివరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:30 AM IST

‘విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి’

BHNG: జిల్లాలోని విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కి వివిధ సమస్యలపై గురువారం వినతి పత్రం అందజేశారు. భువనగిరి మున్సిపల్ పరిధి నుండి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కార్యాలయాలలో పనిచేస్తున్నా వారికి 13 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని అన్నారు.

February 20, 2026 / 08:23 AM IST

‘పత్తి రైతులు ఆందోళన చెందవద్దు’

PDPL: పత్తి రైతులు ఆందోళన చెందవద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇవాళ పత్తి కొనుగోళ్లు ముగించాలని అధికారులు భావించగా, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు కోటపల్లి ప్రాంత పత్తి రైతులు సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

February 20, 2026 / 08:22 AM IST

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు: DPRO

ADB: అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమాచార అండ్ ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తెలిపినట్లు ఆదిలాబాద్ ఇంఛార్జ్ DPRO విష్ణువర్ధన్ తెలిపారు. దరఖాస్తు జారీ ప్రక్రియ రోలింగ్ ప్రాతిపదికన కొనసాగుతుందన్నారు. దరఖాస్తు దారులు ipr.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

February 20, 2026 / 08:17 AM IST

నువ్వుల పంటపై రైతులకు అవగాహన కార్యక్రమం

JGL: మల్యాల మండలం తాటిపల్లిలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్, మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ రైతులకు నువ్వుల పంట సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నువ్వుల సాగులో సరైన మోతాదులో ఎరువుల రకాలను సరైన సమయంలో వాడటం వలన ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని శాస్త్రవేత్త హరికృష్ణ రైతులకు తగు సూచనలు, సలహాలు చేశారు.

February 20, 2026 / 08:10 AM IST

శివాజీ ఆశయాలను ఆచరణలో పెట్టాలి: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మండలంలోని పోలేపల్లి గ్రామంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసహసాలు, పరిపాలనా నైపుణ్యం, నేటి యువతకు ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. శివాజీ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని అన్నారు.

February 20, 2026 / 08:10 AM IST