HYD: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బంజారాహిల్స్లోని వెంగళరావుపార్కులో పాడైపోయిన ఈ-వేస్టేజ్ వస్తువులను సేకరించింది. ఈ స్పెషల్ డ్రైవ్కు స్థానికంగా ఉన్న నివాసితుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక ఆల పరిశీలించారు.