NRPT: పశు పోషణకు తోడ్పాటుగా ప్రభుత్వం 70 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దామరగిద్ద మండలంలోని 30 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 12,678 పశువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో 9,423 ఆవులు, ఎద్దులు 3,256 గేదెలు ఉన్నాయి. ప్రభుత్వం 70 శాతం సబ్సిడీపై 5 కిలోల బస్తా పశుగ్రాస విత్తనాన్ని రూ.130కే అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు.