SDPT: నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సీపీ రష్మీ పెరుమల్ ఆధ్వర్యంలో త్వరలో ఉద్యోగ మిత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్సై మానస తెలిపారు. రాయిపోల్ మండలంలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ లింకులను ఇప్పటికే గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పంపినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.