VZM: ప్రపంచ ఆరోగ్య దినోత్సోవం సందర్భంగా ఇవాళ స్దానిక 42వ డివిజన్ అయ్యన్నపేట మున్సిపల్ నడక మైదానంలో ఆంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ డా.డివిజి శంకరరావు మాట్లాడుతూ.. రోజు నడక, యోగ, తదితర శారీరక వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని స్థానికులకు సూచించారు.