KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ AO వసుంధర ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఆదోని ప్రాంతంలో వేధిస్తున్న తీవ్రమైన తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.