కృష్ణా: చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో గుండేరు మేజర్ డ్రైనేజీపై నూతన వంతెన మంజూరు చేయాలని గ్రామస్థులు రాష్ట్ర మంత్రి బీ.సీ.జనార్దన రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గుండేరుపై వంతెన దాదాపు పదేళ్ల నుంచి శిథిలావస్థకు చేరి ఉందని తెలిపారు. ఇటీవల గుర్రపు డెక్క పట్టేసి వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుందని, నూతన వంతెనకు నిధులు కేటాయించాలని కోరారు.