KRNL: జేఎన్టీయూలో నిర్వహించనున్న స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఇవాళ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ను మంత్రులు టీజీ భరత్, సవిత మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు.