అన్నమయ్య: కేవీ పల్లి మండలం పరిధిలో పాత కక్షలు, గ్రామ ఆధిపత్య పోరుతో న్యాయవాది పూజారి యల్లయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. నిందితులు ముందస్తు పథకం ప్రకారం ట్రాక్టర్లతో దారిని దిగ్బంధించి, ఇంటిపై దాడి చేసి బండరాళ్లతో హత్య చేసినట్లు వెల్లడించారు.