ADB: పెండింగ్లో ఉన్న ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సంతకాల సేకరణ చేపట్టి శాంతియుతంగా వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.