NLG: సీఐటీయూ (CITU) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తుమ్మల వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎండీ సలీం, కోశాధికారిగా ప్రమీల ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా డబ్బీకారు మల్లేష్, చినపాక లక్ష్మీనారాయణ, సైదులు, దండంపల్లి సత్తయ్య, రాజు, మల్లు గౌతమ్రెడ్డి, బయన్నతో పాటు మరికొందరిని కమిటీ సభ్యులుగా జిల్లా మహాసభలలో ఎన్నుకున్నారు.