ASR: సెలవుల్లో ఇంటికి వచ్చే పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ ఆదివారం సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని గమనించాలని తెలిపారు. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.