KMM: నిరుపేదల సొంతింటి కల పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నెరవేరిందని ఎమ్మెల్యే రాగమయి అన్నారు. వేంసూరు మండలం భరణిపాడులో లబ్ధిదారులు వెంకటేశ్వరరావు, సంధ్యారాణి దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఆమె ప్రారంభించి, గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసమే కృషి చేస్తుందని ఆమె అన్నారు.