BHNG: పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో దుండగులు బరితెగించారు. ఏప్రిల్ 14న ప్రతిష్టించాల్సిన అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన దిమ్మెను రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘటనపై మాల కులాల యునైటెడ్ ఫోరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విగ్రహ దిమ్మెను ధ్వంసం చేసిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది.