పార్వతీపురం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర, కలెక్టర్ డా. ప్రభాకరరె డ్డితో కలసి ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా తాగునీరు, డ్రైనేజ్ మరియు రహదారుల అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించారు.