ATP: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎండాకాలం కావడంతో తగినన్ని ఫ్యాన్లు, చల్లని తాగునీరు కొరత లేకుండా ఉండేందుకు డీఈఓ ప్రసాద్ బాబు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు సిబ్బందితో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు.