ATP: అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవానికి ‘మిస్సైల్ ఉమెన్’గా పేరొందిన డా.టెస్సీ థామస్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ అయిన ఆమెకు ఈ వేడుకలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు.