MNCL: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని జన్నారం మండలం ఎంపీవో జలంధర్ సూచించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగింది. పలు విషయాలను వార్డు సభ్యులకు ఎంపీవో వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.