MLG: జిల్లా పసర గ్రామానికి చెందిన సంధ్యారెడ్డి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో “శివంగి ఆత్మీయ పురస్కారం” అందుకున్నారు. కాకతీయ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఘన సన్మానం జరిగింది. వాకర్స్ సభ్యులు ఆమెను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఆమె సమాజ సేవా కార్యక్రమాలు, మహిళల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.
WNP: వీపనగండ్ల, పానగల్ మండలాల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఘనంగా సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, వికారాబాద్ ఇన్ఛార్జ్ సుధాకర్ రావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
VKB: కుల్కచర్లలో సంవత్సరాలుగా ఆగిపోయిన రోడ్డు పనులను తూతూమంత్రంగా నిర్వహించారు. కానీ, రోడ్డు మధ్యలో సిమెంట్ డివైడర్లలో ఎర్రమట్టి వేయాలని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల అలసత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యాంగ వ్యవహరించడం వల్లనే ఇలా జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
MDCL: ఎక్కడైనా అనుమతి లేకుండా డీజేలు పెడుతున్నారా..? వెంటనే ఫిర్యాదు చేయాలని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి సూచించారు. కాలనీలు, వీధుల్లో భారీ శబ్దంతో డీజేలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీస్ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
NRML: జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీసీ ముంతాజ్పై బాధితులు మొఖీమ్ అహ్మద్, సాదిక్ బేగ్ ఫిర్యాదు చేశారు. సారంగాపూర్ మండలంలో ఆర్ఐగా పనిచేసిన సమయంలో కళ్యాణ లక్ష్మి పథకం పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో తమను అనవసరంగా కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ADB: ఇచ్చోడ మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ బండారి రాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 3 మోటార్ సైకిల్లు, 9 మొబైల్ ఫోన్లు, రూ.4470 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ నిర్వహిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని CI రాజు హెచ్చరించారు.
KNR: కరీంనగర్ వన్ టౌన్ స్టేషన్ ఎదుట కేడీసీసీ బ్యాంకు వద్ద ట్రాఫిక్ పోలీసులు“అరైవ్-అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్సైలు ప్రసాద్, సురేష్, చిన్న నాయక్ అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించడం ద్వారానే ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో, టాక్సీ డ్రైవర్లు, తదితరులు ఉన్నారు.
ASF: రాష్ట్రంలో జనగణనలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఎన్యుమరేటర్కు 700-800 జనాభా కేటాయించాలని తెలిపారు. ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత జిల్లాలో గణన పకడ్బందీగా చేపడతామని పేర్కొన్నారు.
NZB: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలకు రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. ఉమ్మడి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
HYD: హైడ్రా కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 58 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కాలనీ రహదారుల కబ్జాలు తదితర సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
KMM: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్కు వినతిపత్రాన్ని అందజేశారు. పెనుబల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఒంటిపూట బడుల సమయాన్ని పెంచడం సరికాదని వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విద్యాశాఖ ఒంటిపోటు బడులను పెడితే రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
SRPT: పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సోమవారం హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించిన కాపీని కలెక్టర్కు అందజేశారు. ఏప్రిల్ 1న అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ పోనుగోటి నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
SRD: సిర్గాపూర్ మండలం పొట్పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పట్నం ఝరప్ప (58) సోమవారం పండరీపూర్ యాత్ర ముగించుకొని తుల్జాపూర్ భవాని మాతను దర్శించేందుకు క్యూ లైన్లో ఉండగానే ఛాతిలో నొప్పి రావడంతో అక్కడి సెక్యూరిటీ సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో గుండెపోటు రావడంతో రాత్రి మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు.
HYD: మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. గత వారం మాంసం KG రూ. 300 నుంచి రూ. 325 మధ్య అమ్ముడుపోయింది. ఆదివారం నుంచి ధరలు తగ్గుతూ వచ్చాయి. HYDలో ఇవాళ విత్స్కిన్ KG రూ.220, స్కిన్లెస్ రూ. 251 చొప్పున ధర నిర్ణయించారు. ఇదిలా ఉంటే మార్జిన్ పెంచాలన్న డిమాండ్తో రేపటి నుంచి నగరంలో చికెన్ షాపుల బంద్కు వ్యాపారులు పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల వాతావరణం చల్లబడినప్పటికీ, రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం తమను నిలువునా ముంచుతోందని రైతులు దిగులు చెందుతున్నారు.