• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘సాదా బైనమా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు’

JGL: పెగడపల్లి మండలంలో సాదా బైనామా భూ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ఆనంద్ కుమార్ తెలిపారు. మండలంలో మొత్తం 1840 సాదా బైనామా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇందులో నుంచి 1791 దరఖాస్తులను పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయానికి పంపించామని, 49 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 05:00 AM IST

రైలు ఢీకొని మత్స్యకారుడు మృతి

NZB: నవీపేట్ మండలంలోని యంచ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు పోశెట్టి చేపలు పట్టుకొని తిరిగి వస్తుండగా రైలు పట్టాలను దాటే సమయంలో దేవి ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోశెట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

February 20, 2026 / 04:54 AM IST

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకం: కలెక్టర్

ASF: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని కలెక్టర్ హరిత అన్నారు. కాగజ్ నగర్ మైనారిటీ సంక్షేమ పాఠశాలలో ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల నూతన సర్పంచ్లకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లదే కీలక భూమిక ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు.

February 20, 2026 / 04:25 AM IST

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు

KNR: చిగురుమామిడి గ్రామంలో వచ్చే వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడానికి గ్రామ సర్పంచ్ ఆకవరం భవాని ఆధ్వర్యంలో ఎంపీవో ఎండీ ఖాజా మొయినుద్దీన్ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ జ్ఞానేశ్వరిలు గ్రామంలో పర్యటించారు. నీటి ట్యాంకుల రిపేరులు, గేట్ వాల్స్ రిపేర్స్, నూతన పైపులైన్లు వేసి చేతి పంపు మెటీరియల్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు.

February 20, 2026 / 04:09 AM IST

ఆంజనేయస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు

JGL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 43 రోజులకు గాను 14 హుండీలను కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శ్రీ లలితా సేవాట్రస్ట్‌చే గురువారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,16,04,438 నగదు, 199 విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వచ్చిన వెండి, బంగారాన్ని ఒక బ్యాగ్‌లో వేసి సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు.

February 20, 2026 / 04:02 AM IST

B.Y నగర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

సిరిసిల్ల పట్టణం B.Y నగర్ లోని యశ్వసిన్ మండప్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశభక్తి, పరాక్రమం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

February 19, 2026 / 10:19 PM IST

వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాల ప్రవేశాలు

మహబూబ్ నగర్: గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో 6-10 తరగతుల్లో దరఖాస్తులను ఆహ్వానించారు అని ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7-10 తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని, ఈ నెల 28లో https://tgms.telangana.gov.inలో దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉంటుందని పేర్కొన్నారు.

February 19, 2026 / 09:59 AM IST

గోరింకలపల్లిలో గ్రామ సంఘం భవనానికి శంకుస్థాపన

NLG: నకరేకల్ మండలం గోరింకలపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘం భవనానికి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంబించారు.

February 19, 2026 / 09:52 AM IST

గోరింకలపల్లిలో గ్రామ సంఘం భవనానికి శంకుస్థాపన

NLG: నకరేకల్ మండలం గోరింకలపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘం భవనానికి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంబించారు.

February 19, 2026 / 09:52 AM IST

గణేష్ పల్లెలో చత్రపతి శివాజీ జయంతి

BHPL: గణేష్ పల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి స్థానిక ఆరే కుల సంక్షేమ సంఘం నేతలు, గ్రామస్థులు నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా నాయకులు తిప్పారపు బాపూరావు, మాజీ సర్పంచ్ తిప్పారపు యుగంధర్ అన్నారు.

February 19, 2026 / 09:51 AM IST

గణేష్ పల్లెలో చత్రపతి శివాజీ జయంతి

BHPL: గణేష్ పల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి స్థానిక ఆరే కుల సంక్షేమ సంఘం నేతలు, గ్రామస్థులు నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా నాయకులు తిప్పారపు బాపూరావు, మాజీ సర్పంచ్ తిప్పారపు యుగంధర్ అన్నారు.

February 19, 2026 / 09:51 AM IST

ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొందాలి: కలెక్టర్

BDK: పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలోని ప్రతి పదో తరగతి విద్యార్థులు సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.

February 19, 2026 / 09:25 AM IST

ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొందాలి: కలెక్టర్

BDK: పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలోని ప్రతి పదో తరగతి విద్యార్థులు సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.

February 19, 2026 / 09:25 AM IST

‘ప్రభుత్వ పథకాలకు రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

SRPT: మునగాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను వెంటనే పూర్తి చేసుకోవాలి మునగాల AO రాజు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే పీఎం కిసాన్, పంట బీమా, ఇతర ప్రభుత్వ రాయితీలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ క్షస్టర్ ఏఈవోలను సంప్రదించి ఈ ప్రక్రియను త్వరగా ముగించాలని రైతులను కోరారు.

February 19, 2026 / 09:25 AM IST

‘ప్రభుత్వ పథకాలకు రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

SRPT: మునగాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను వెంటనే పూర్తి చేసుకోవాలి మునగాల AO రాజు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే పీఎం కిసాన్, పంట బీమా, ఇతర ప్రభుత్వ రాయితీలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ క్షస్టర్ ఏఈవోలను సంప్రదించి ఈ ప్రక్రియను త్వరగా ముగించాలని రైతులను కోరారు.

February 19, 2026 / 09:25 AM IST