• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆస్పిరేషన్ బ్లాక్ అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి

NRPT: నర్వ ఆస్పిరేషన్ బ్లాక్లో జిల్లా కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 24న నీతి ఆయోగ్ అదనపు మిషన్ డైరెక్టర్ సందర్శన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దకడుమూర్ గ్రామంలో పీఎం శ్రీ పాఠశాల పథకం కింద కేటాయించిన వార్షిక బడ్జెట్ వ్యయం, కొనసాగుతున్న పాఠశాల కార్యక్రమాలు, టాయిలెట్ సౌకర్యాలను పరిశీలించారు.

February 20, 2026 / 06:36 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తొలి రోజు ఆమనగల్లులో నిన్న సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ ఛైర్‌పర్సన్ గీతా నరసింహ, మున్సిపల్ ఛైర్మన్ పత్యనాయక్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:35 AM IST

నక్ష సర్వే తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న యూఎల్బీ (నక్ష) సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి గురువారం తనిఖీ చేశారు. 13 మంది బృందంతో 11 వార్డుల్లోని 158 బ్లాకుల్లో ఏడీఎస్ ల్యాండ్ సర్వే చేపట్టిన విధానాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు జిల్లాలో 3,854 ఇళ్లు, 1,048 వ్యవసాయ భూభాగాలు (1,024 ఎకరాలు) సర్వే పూర్తయ్యాయి.

February 20, 2026 / 06:33 AM IST

ఎమ్మెల్యే కడియం మోసానికి మరో పేరు: ఎమ్మల్యే

JN: కేసీఆర్‌ పై కడియం శ్రీహరి చేసిన దుర్మార్గ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జనగామ MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరి మోసం, ద్రోహం, అవకాశవాదానికి మరోపేరని విమర్శించారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలే అతని రాజకీయ జీవితానికి చరమగీతం పాడతారని హెచ్చరించారు.

February 20, 2026 / 06:31 AM IST

పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు ఇవి పాటించాల్సిందే: సీపీ

NZB: పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. చిన్నారులు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంచాలని హెచ్చరించారు. లేకపోతే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పిల్లలకు UPI పిన్, క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకూడదని అన్నారు.

February 20, 2026 / 06:31 AM IST

‘టీ-సేఫ్’ యాప్‌ను ప్రతి ఒక్క మహిళ వాడాలి: RSI

WGL: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ITI కళాశాలలో గురువారం సాయంత్రం షీ టీం RSI స్వాతి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్వాతి మాట్లాడుతూ.. మహిళలపై పెరుగుతున్న సైబర్ నేరాలు, అఘాయిత్యాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రయాణాల్లో భద్రత కోసం ‘టీ-సేఫ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వినియోగించాలని తెలిపారు.

February 20, 2026 / 06:26 AM IST

జిల్లాకు గర్వకారణంగా నిలిచిన దుర్గ భవాని

BDK: అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన దుర్గ భవాని రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీల్లో లెమన్ అండ్ స్పూన్ విభాగంలో రెండవ స్థానం సాధించింది. గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆమెను అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.

February 20, 2026 / 06:25 AM IST

‘విహార యాత్రల ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందవచ్చు’

PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుడు నిన్న విజ్ఞాన విహార యాత్రలకు వెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందుతారని తెలిపారు. విషయాలను బాగా అవగాహన చేసుకోగలుగుతారని పేర్కొన్నారు.

February 20, 2026 / 06:23 AM IST

శోభాయమానంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

VKB: ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన మహనీయుడని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటిగారి శివరాజ్ పేర్కొన్నారు. నిన్న వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి హనుమాన్ దేవాలయం నుంచి వికారాబాద్ పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తా ఆంజనేయస్వామి ఆలయం వరకు శివాజీ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు.

February 20, 2026 / 06:19 AM IST

ఇస్లాంలో ఐదు ప్రాథమిక విధులు

SRD: జిల్లా రంజాన్‌ మాసంలో ప్రపంచంలోని ప్రతి ముస్లీం ఐదు ప్రాతమిక విధులను తప్పనిసరిగా నిర్వహించాలని ఇమామ్ నయ్యర్ అజాం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇమాన్‌, నమాజ్‌, జకాత్‌, రోజా, హజ్ అనే విధులను విధిగా నిర్వహించాలి. ఇమాన్‌ భగవంతుడైన అల్లాహ్‌పై పూర్తిగా విశ్వాసం ఉంచాలని, నమాజ్‌, ఎనిమిదేళ్లు దాటిన వారు విధిగా 5 సార్లు నమాజ్‌ చేయాలని తెలిపారు.

February 20, 2026 / 06:13 AM IST

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు: CPM

KMM: మధిర బోడెపుడి భవన్‌లో సీపీఎం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు నమ్మి స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి విజయాన్ని అందించిందన్నారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేయొద్దని హితవు పలికారు.

February 20, 2026 / 06:12 AM IST

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన.. వేములపల్లి వాసి

BHPL: మొగుళ్ళపల్లి (M) వేములపల్లికి చెందిన సాత్విక్ సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల BHPL జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో సాత్విక్ షాట్‌పుట్, జావెలిన్ త్రో విభాగాల్లో అద్భుత ప్రదర్శన చూపించాడు. ఈ రెండు ఈవెంట్‌లలోనూ ఉత్తమ ఫలితాలతో రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.

February 20, 2026 / 06:11 AM IST

‘ప్రైవేట్ స్కూల్ ఫీజులపై నిఘా ఉంచాలి’

ADB: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దందా మితిమీరిపోతోందని రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరువు కాలంలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఫీజుల విషయంలో పిల్లలను ఇబ్బంది పెట్టకుండా నేరుగా తల్లిదండ్రులతోనే మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

February 20, 2026 / 06:09 AM IST

నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

KMR: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు పాల్వంచ మండలంలో పర్యటించనున్నారు. మండల కేంద్రంలోని రైతు సింగిరెడ్డి బలరాం రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న ‘ఆయిల్ పామ్ మొక్కల మాస్ ప్లాంటేషన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన అధికారి జ్యోతి హాజరుకానున్నారు.

February 20, 2026 / 06:04 AM IST

‘రైతులు తప్పని సరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి’

WNP: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆత్మకూరు వ్యవసాయ అధికారి అరవింద్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డులు, భూమి యాజమాన్య పాస్ పుస్తకం, ఆధార్ లింకు చేసిన మొబైల్ ఫోన్‌లో సమీపంలోని వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని ఆయన చెప్పారు.

February 20, 2026 / 06:04 AM IST