WNP: హెచ్పీవీ వ్యాక్సినేషన్తో మహిళలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. రేవల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఉన్న 14 ఏళ్ల పైబడిన 29 మంది బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ చేశారు. బాలికలకు తల్లిదండ్రుల ఆమోదంతో ఉచితంగా వేసినట్లు తెలిపారు.