PDPL: పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. 45 సంవత్సరాల ఓ మహిళకు గర్భాశయంలోని పెద్ద గడ్డను అధునాతన ఆపరేషన్ ద్వారా విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు.