HYD: సనత్నగర్ TIMS ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం, సౌకర్యాల విస్తరణకు చర్యలు చేపట్టారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల కుటుంబ సభ్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 200 పడకలతో ధర్మశాల ఏర్పాటు చేయనున్నారు. ఈ ధర్మశాలలో విశ్రాంతి, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించబడనున్నాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉపశమనం లభించనుంది.