KMM: పెనుబల్లి మండలంలోని వీ.ఎం.బంజర్ రింగ్ సెంటర్లో ఆదివారం సాయంత్రం ఓ డీసీఎం వ్యాన్ కలకలం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంగా వచ్చి, మూసి ఉన్న చెప్పుల దుకాణంలోకి వాహనం దూసుకెళ్లింది. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలసుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.