KKD: గొల్లప్రోలు పట్టణంలో జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు సొంత నిధులతో వాటర్ ట్యాంకర్ సమకూర్చారు. దీనిని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. వేసవిలో తాగునీటి కొరతను ముందుగానే గుర్తించి, ప్రభుత్వ సహాయం కోసం వేచి చూడకుండా స్వయంగా ముందుకు వచ్చిన తమ్మయ్య నాయుడు చొరవను ఎంపీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.