NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమరావతికి మద్దతుగా సంబరాలు చేశారు. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి వర్ధిల్లాలని పలువురు అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు.