HYD: D.Ed, B.Ed అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మారపు పవన్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు HYDలో వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 20 వేల ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. దీనిపై నిరుద్యోగ అభ్యర్థుల పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతూ తామూ పాల్గొంటామని ఆమె తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.