KNR: హుజూరాబాద్ మండలం చెల్పూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( పీహెచ్సీ) ముందు ఆశా కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు రావాల్సిన పెండింగ్ మార్చి, ఏప్రిల్ పారితోషకాలు ఇవ్వాలని, అలాగే రూ.18000 ఫిక్స్డ్ వేతనం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసన అనంతరం విధుల్లో చేరారు.