NLG: చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఇవాళ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్కు ఆలయ ఈవో మోహన్ బాబు, ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బ్రహ్మోత్సవాలకు సంబందించిన ఏర్పాట్ల గురించి తెలసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
మహబూబాబాద్ జిల్లా నూతన వ్యవసాయ శాఖ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన సరిత ఇవాళ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఎరువుల కొరత, ఆలస్యం వంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
BHPL: మొగుళ్ళపల్లి మండలం మేదరమట్లలో ఇవాళ ‘రైడర్స్’ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో ఓ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.82,500 నగదును దొంగిలించారు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
RR: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రేపు 18 కోట్ల రూపాయలతో హెచ్ఎండీఏ ద్వారా చేపట్టిన ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అంబెడ్కర్ చౌరస్తాలో HRDCL ద్వారా చేపట్టిన 4లైన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
SRCL: మహిళల ఆర్థిక ప్రగతి ద్వారానే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావిస్తూ ప్రతి ప్రభుత్వ పథకంలో వారిని భాగస్వాములను చేస్తున్నామని ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, మరమ్మత్తుల పనులను అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద మహిళా సంఘాలకు అప్పగించామని, స్కూల్ పిల్లల యూనిఫాంల కుట్టింపుతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆమె వివరించారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కాపు వాడ, సంజీవయ్య కాలనీల్లో MLA హరీష్ బాబు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాపువాడలో మేజర్ డ్రైన్ నిర్మాణం కోసం కోటి 20 లక్షల రూపాయలు వెచ్చించనున్నామని తెలిపారు. అలాగే సంజీవయ్య కాలనీలో రోడ్డు తదితర డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని అయన పేర్కొన్నారు.
NLG: మునుగోడు మండలంలోని కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులు ఎస్ లక్ష్మీ ప్రసన్న, యామినిలు ఎస్బీఐ ఆశా స్కాలర్ షిప్ 2025కు ఎంపిక అయ్యారు. సోమవారం ఆ విద్యార్థులు రూ.15వేల స్కాలర్ షిప్ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల హెచ్ఎం వెంకటనారాయణ మాట్లాడుతూ… పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చిన విద్యార్థినిలను అభినందించారు.
NZB: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. TUFIDS నిధులతో నగరంలోని పలు డివిజన్లో అభివృద్ధి పనులను ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రోడ్లు, నాణ్యమైన డ్రెయినేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు ప్రత్యేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
NGKL: ‘అరైవ్ ఎలైవ్’ రోడ్డు భద్రత మహా ఉద్యమంలో భాగంగా అంకిరావుపల్లిలో సోమవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఎస్సై బండారు సురేష్ వాహనదారులకు రోడ్డు నిబంధనలను పాటించాలని, హెల్మెట్, సీటు బెల్టు ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పుతుందని, అజాగ్రత్త వల్ల కుటుంబాలు వీధిన పడతాయని హెచ్చరించారు.
WGL: జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించబోతున్న విద్యార్థులను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సైన్స్ అధికారి పాల్గొన్నారు.
BHPL: జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం నుంచి డా. బి.ఆర్. అంబేద్కర్ స్టేడియం వరకు మంగళవారం(రేపు) జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని క్రీడా సంఘాల బాధ్యులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
KMR: స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ భారత్ యాత్ర’ వాహనం 9వ రోజు సోమవారం కామారెడ్డి కలెక్టరేట్కు చేరుకుంది. ఈ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, తడి-పొడి చెత్త ఏర్పాటు, వ్యర్థాల నుంచి వస్తువుల తయారీ విధానాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన వీక్షించారు.
MHBD: ‘జైగౌడ’ ఉద్యమం జిల్లా అధ్యక్షునిగా గుదే వీరన్న గౌడ్ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు రామారావు గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని ఇవాళ వీరన్నకు అందజేశారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ.. జిల్లాలో గౌడ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
MBNR: సినీ నిర్మాత బండ్ల గణేష్ షాద్ నగర్ నుంచి తిరుపతి వరకు చేపట్టిన పాదయాత్ర సోమవారం బాలానగర్ చేరుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు విజయం కోసం మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అభిమానులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు.
HYD: సైబర్ నేర బాధితులకు త్వరిత న్యాయం అందించేందుకు HYD పోలీసుల వినూత్న కార్యక్రమం ‘సీ-మిత్ర’ సత్ఫలితాలిస్తోంది. ప్రారంభమైన పది రోజుల్లోనే 1000 మందికి ఫోన్ కాల్స్ చేసి భరోసా కల్పించారు. ఏఐ సాయంతో 200 ఫిర్యాదు డ్రాఫ్ట్లు సిద్ధం చేసి, 100కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇంటి నుంచే ఫిర్యాదు చేసి, మొబైల్కే ఎఫ్ఐఆర్ కాపీ అందుతుండటంతో హర్షం వ్యక్తం చేశారు.