BHNG: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశంలో పెరుగుతున్న లవ్ జిహాద్, అక్రమ మత మార్పిడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా ప్రచార ప్రముఖ్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఈ కుట్రలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. యువతుల జీవితాలతో ఆడుకుంటున్న వికృత మనస్తత్వాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
NRPT: మరికల్ మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్పంచ్ కోయిలకొండ నాగమణిరఘు సోమవారం భూమిపూజ చేశారు. దాతల సహకారంతో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మునిస్వామి, రవిచంద్ర కుమార్ అంజి, శ్రీను, గ్రామస్థులు పాల్గొన్నారు.
GDWL: జిల్లాలో సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సోమవారం అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు గద్వాలలో బీసీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. వంటశాల, స్నానాల గదులు, మరుగుదొడ్లను పరిశీలించి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని తెలిపారు. వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ, సమస్యలు లేకుండా నిర్వహించాలన్నారు.
NGKL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కి 14 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించి చట్టపరమైన సాయం పొందాలని ఆయన సూచించారు.
SDPT: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బెజ్జంకి మండలంలోని బీసీ హాస్టల్ను ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ పరిశీలించారు. హాస్టల్లో ఆహార నాణ్యత, సౌకర్యాలు, పరిశుభ్రత, భద్రతపై సమీక్షించారు. బాత్రూంలలో తగిన నీటి వసతి కల్పించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ADB: గాదిగూడ మండలంలోని మేడిగూడ గ్రామంలో సోమవారం బాల్యవివాహం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని పోలీసులు సమాచారాన్ని అందుకున్నారు. దీంతో ఎస్సై రమ్య సిబ్బందితో కలిసి వివాహం నిర్వహిస్తున్న కుటుంబానికి బాల్యవివాహం వల్ల వచ్చే పరిణామాలను వివరించి వారిని అడ్డుకున్నారు. ఎవరైనా బాల్యవివాహం నిర్వహిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.
MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలో నిర్వహించిన ‘బడిబాట’లో హెచ్ఎం తారా సింగ్ పాల్గొన్నారు. నర్సరీ నుంచి 5 వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పిల్లల భవిష్యత్తు మారుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
MDCL: కాలువలు, నాళాలలో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించడం ద్వారా నీటి ప్రవాహం సులభతరం అవుతుందని, దీనివల్ల వర్షాకాలంలో వరద ముప్పు తగ్గుతుందని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ హరిజన బస్తీలో ఆమె పర్యటించి పూడిక తొలగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.
VKB: కొడంగల్ తహసీల్దార్ రాంబాబు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సోమవారం సందర్శించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా విద్యార్థుల మధ్యాహ్న భోజనం పరిశీలించారు. వంట గది, బాత్రూంలు, పాఠశాల వసతులను తిరిగి చూశారు. అన్ని వసతులు బాగున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామదాస్, పాఠశాల బృందం పాల్గొన్నారు.
RR: కొందుర్గు మండలం గంగన్నగూడ, ఆగిర్యాల వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురిసే లోపు వంతెనలు సిద్ధం కావాలని, వర్షాకాలపు ప్రమాదాలను వెంటనే నివారించేందుకు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో రూ.25 కోట్లతో అన్ని మండలాల్లో వంతెనల పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.
HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 43 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా టౌన్ ప్లానింగ్ (24), ఇంజనీరింగ్ (7) విభాగాలపై వినతులు వచ్చాయి. కమిషనర్ స్వయంగా ప్రజలతో మాట్లాడి, ప్రతి సమస్యను సమీక్షించి, సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన పౌర సేవలే లక్ష్యంగా, ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
MNCL: మందమర్రి ఏరియాలోని సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు పరిష్కరించాలని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. కొత్త టెండర్ పిలిచి కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
KMM: చిన్న ఆలోచనలే పెద్ద ఆవిష్కరణలకు దారి చూపిస్తాయని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి సంబంధిత అధికారులతో ఇన్నోవేషన్ పంచాయత్ పై సమావేశమయ్యారు. ఏప్రిల్ 25న ఖమ్మం ఐటీ హబ్లో ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం ఉందన్నారు.
NZB: నూతనంగా నియమితులైన తెలంగాణ యూనివర్సిటీ క్లాస్-2 పాలకవర్గ సభ్యులను సోమవారం వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యూనివర్సిటీకి ఆహ్వానించి సన్మానించారు. వర్సిటీ పనితీరు, కొనసాగుతున్న అభివృద్ధిని వారికి వివరించారు. పాలకమండలి సభ్యులు వర్సిటీ అభివృద్ధికి ఎల్లవేళలా ముందుంటామని హామీ ఇచ్చారు. పాలకమండలి సభ్యులు ప్రొ. ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.
SRCL: మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో మేడే పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్ లుతెచ్చి ఇబ్బంది పెడుతుందన్నారు.