• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా

ADB: ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకుని రచయితగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. గురువారం తాంసి మండలంలోని పొన్నారి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల రచించిన గేయాల సంపుటి ‘మోదుగ మొగ్గలు’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో పిల్లలు పుస్తక పఠనానికి దూరం కాకూడదని సూచించారు.

April 23, 2026 / 05:12 PM IST

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కవ్వంపల్లి

KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ఐకేపీ, హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. అనంతరం డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ.. ధాన్యం అమ్మకాల విషయంలో రైతుల కష్టనష్టాలను తొలగించడమే కాకుండా వారికి మద్దతు ధర పొందాలని సూచించారు.

April 23, 2026 / 05:12 PM IST

సరదా కోసం ఈతకు వెళ్లి ప్రమాదానికి గురి కావొద్దు: SP

ASF: సరదా కోసం ఈతకు వెళ్లి ప్రమాదానికి గురి కావొద్దని ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ గురువారం ప్రకటనలో సూచించారు. రేపటి నుండి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు అధిక వేడి నుండి జాగ్రత్తలు వహించాలని SP సూచించారు.

April 23, 2026 / 05:11 PM IST

ప్రధాన రోడ్డుపై భారీగా గుంతలు

SDPT: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ప్రధాన రోడ్డుపై భారీగా గుంతలు పడ్డాయి. గడిచిన రెండేళ్లుగా ఏలాంటి మరమ్మత్తులు చేపట్టకపోవడంతో గుంతలు రోజురోజుకీ పెద్దవిగా మారుతున్నాయి. వాహనదారులు ముఖ్యంగా ద్విచక్రవాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు రాత్రి వేళల్లో కింద పడి గాయాల పాలవుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రోడ్డును వెంటనే అధికారులు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

April 23, 2026 / 05:10 PM IST

BRS కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పని చేయాలి: జ్యోతి

BHPL: KCRను తిరిగి ముఖ్యమంత్రి చేసే దాకా BRS కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పని చేయాలని మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. భూపాలపల్లిలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జ్యోతి మాట్లాడుతూ.. ఈనెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ, గ్రామాన ఘనంగా నిర్వహించాలని, KCR నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు.

April 23, 2026 / 05:10 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకం

MDCL: కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడారు. ప్రాజెక్టు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సబిత అనిల్ కిషోర్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

April 23, 2026 / 05:07 PM IST

‘కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రావాలి’

RR: లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.  ఆయన మాట్లాడుతూ.. పీ.సీ ఘోష్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరును ప్రపంచ దేశాలు సైతం అభినందించాయని, సాగునీటి నిపుణులు సైతం ప్రశంసించారని పేర్కొన్నారు.

April 23, 2026 / 05:03 PM IST

‘మహిళా రిజర్వేషన్ బిల్లు ఆపడం దారుణం’

MLG: మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆపడం ఘోర అన్యాయం అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. డిలిమిటేషన్ పేరుతో మహిళా బిల్లును నిలిపివేయడం ఘరానా మోసం అని ఆరోపించారు. తక్షణమే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, లేదంటే నిరసనలు తప్పవన్నారు.

April 23, 2026 / 05:02 PM IST

కొడంగల్లో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. ఇదీ పరిస్థితి

VKB: కొడంగల్లో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రైవేటు వాహనాలు జోరుగా నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో కొడంగల్ చుట్టూపక్కల గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ వాహనదారులు ఎక్కువ కిరాయిలు తీసుకుంటున్నారు. వేసవికాలం స్కూల్ సెలవులు రావడంతో కొడంగల్ బస్టాండు ప్రజల తాకిడి పెరిగింది.

April 23, 2026 / 05:02 PM IST

రాష్ట్ర సోషల్ మీడియా ఇంఛార్జిగా జోడు ప్రదీప్

BHPL: టీఎస్. జేయూ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జిగా గణపురం మండలానికి చెందిన జోడు ప్రదీప్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రదీప్‌కు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం, కార్యదర్శి అనిల్ కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రదీప్ కృతజ్ఞతలు తెలియజేశారు.

April 23, 2026 / 05:01 PM IST

కో-ఆప్షన్‌ సభ్య పదవికి వాజిదా నామినేషన్

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలో మహిళా కో-ఆప్షన్ సభ్య పదవికి వాజిదా బేగం గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో ఆమె అభ్యర్థిత్వ పత్రాలను సమర్పించారు. పలువురు జర్నలిస్టులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పట్టణాభివృద్ధి, మహిళల సంక్షేమానికి కృషి చేస్తానని వాజిదా బేగం పేర్కొన్నారు.

April 23, 2026 / 05:01 PM IST

మెకానిక్‌ల కుటుంబాలకు ఆర్థిక సాయం

GDWL: చిన్నతాండ్రపాడులో మృతి చెందిన మెకానిక్ సత్యం, భరత్ కుటుంబాలకు తోటి కార్మికులు రూ.50 వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. సత్యం కుటుంబానికి రూ.26 వేలు, భరత్ కుటుంబానికి రూ.24 వేలు గురువారం అందజేశారు. అనాథలైన వారి పిల్లలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సుధాకర్, దేవరాజు, బీచుపల్లి, చాంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

April 23, 2026 / 05:01 PM IST

‘మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి’

PDPL: జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణు భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సమాజ హితం కోసం భగీరథుడు అవిశ్రాంతంగా కృషిచేసి, నేటి యుసమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడని పేర్కొన్నారు. మహనీయులను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

April 23, 2026 / 05:00 PM IST

క్షయ వ్యాధి గ్రస్థులకు పోషకాహర కిట్ల పంపిణీ

BHNG: యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్షయ వ్యాధి గ్రస్థులకు మిత్ర పథకం ధ్వారా పోషకాహర కిట్లను గురువారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కిట్లల్లో ఉండే బియ్యం, పప్పులు, వేరుశనగలు, వంట నూనె, చిరుధాన్యాలు రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతాయని అన్నారు.

April 23, 2026 / 05:00 PM IST

కుక్కల దాడి గొర్రెకు గాయాలు.. చికిత్స చేసి డాక్టర్

SRPT: దూదియాతండా గ్రామానికి చెందిన గుగులోతు సానా పెంచుకుంటున్న గొర్రెపోతుపై ఊర కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలతో ఉన్న గొర్రెపోతును యజమాని ఇవాళ కోదాడ పట్టణంలోని పశువైద్యశాలకు తరలించారు. గాయాని పరిశీలించిన అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి గొర్రెపోతును కాపాడారు.

April 23, 2026 / 05:00 PM IST