NZB: జిల్లాలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్నట్లు AAP జాతీయ ప్రతినిధి, రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్, NZB జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ తెలిపారు. సోమవారం ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తరహా అభివృద్ధిని NZB జిల్లాలో సాకారం చేయడమే తమ ప్రధాన ఎజెండా అన్నారు.
PDPL: జిల్లాలోని ఇద్దరు ట్రాన్స్జెండర్లకు సోమవారం అడిషనల్ కలెక్టర్ వేణు ఉపాధి హామీ పథకం కింద యూనిట్లను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, సూపరింటెండెంట్ రాజయ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలతతో పాటు ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు.
SDPT: లోక కళ్యాణార్థం శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయాలని భక్తి రత్న జాతి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. సోమవారం గజ్వేల్లో శ్రీ రామ రక్షా స్తోత్ర పుస్తకాలను స్థానిక కళాశాలలో పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు రామనామం విశిష్టత దాని గొప్పతనాన్ని తెలియజేశారు. ఇందులో ప్రిన్సిపాల్ కూడారి రాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యాపకులు ఉన్నారు.
ADB: నార్నూర్ మండల కేంద్రాన్ని సోమవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా సందర్శించనున్నారు. ఈ సందర్బంగా నీతి ఆయోగ్ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన గిరిజన సంగ్రహాలయం, లైబ్రరీని ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి RO ప్లాంట్ను సైతం ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
PDPL: ధర్మారం మండలంలో సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాటు చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ధర్మారం MPDO కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్ష నిర్వహించారు. గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఇందులో ZP CEO నరేందర్, DPO వీర బుచ్చయ్య, తాసిల్దార్ శ్రీనివాస్, MPDO సుమలత పాల్గొన్నారు.
SRPT: ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
BHNG: జాంబవ హక్కుల సాధన సమితి నూతన సంఘం కరపత్రాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం, ఆలేరుకు చెందిన సంఘం సభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆవిష్కరించి మాట్లాడారు. మాదిగ, మాదిగ ఉపకులాల కవులు, రచయితలు, గాయకులు, డప్పు కళాకారులు, చిందు, బుడిగే, బైండ్ల కళాకారుల జీవన పోరాటంలో భాగంగా ఈ సంఘం ఆవిష్కరణ జరిగిందన్నారు.
RR: చౌదరిగూడ మండలం తుమ్మలపల్లిలో నిర్వహించిన క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీ సోమవారం ముగిసింది. విజేతలకు BRS నేతలు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను క్రీడల్లో ప్రోత్సహించేందుకే పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆర్థిక సహాయంతో మొదటి విజేతకు నగదు, ట్రోఫీ బహుమతి అందజేసినట్లు తెలిపారు.
ASF: జైనూర్ 33/11KV సబ్ స్టేషన్లో ఈనెల 21న విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఆసిఫాబాద్ రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని జైనూర్, కెరమెరి, తిర్యాణి, సిర్పూర్ (U), లింగాపూర్ మండలాల ప్రజలు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తమ ఫిర్యాదులను అధికారులకు నేరుగా అందజేయవచ్చు. అత్యవసర ఫిర్యాదుల కోసం 1912ను సంప్రదించాలన్నారు.
SRD: వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నీటి ఎద్దడి నివారణకు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నారాయణఖేడ్ ప్రాంతంలో ముందస్తు ప్రణాళిక తయారు చేయాలన్నారు.
NZB: బోధన్ పట్టణంలో విద్యుత్ లైన్ల అభివృద్ధి పనుల కారణంగా రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ నాయిని కృష్ణ తెలిపారు. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 01:30 గంటల వరకు షర్బతి కెనాల్, సరస్వతి నగర్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా, శివాలయం, మార్కెట్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా, విశ్వేశ్వరయ్య పార్క్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.
NLG: వేములపల్లి మండలంలోని మొల్కపట్నం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్కు సోమవారం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులైన వారిని ఎంపిక చేశారని తెలిపారు. 15 రోజుల్లో అధికారులతో విచారణ చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్ అన్నారు.
SDPT: జగదేవపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ పి. వేణుగోపాల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ పథకం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పలు పనులు ప్రారంభించి కులీలకు పని కల్పించాలని, అదేవిధంగా గ్రామాల్లో నర్సరీలలో మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.
ADB: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 1049 సంఘాలకు గాను రూ.4,25,70,880 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు.
KMR: భువనేశ్వర్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సెమినార్లో సౌత్ క్యాంపస్ సోషల్ వర్క్ హెడ్ డాక్టర్ అంజయ్య బందెలకు భారత్ వికాస్ అవార్డ్ లభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆధ్వర్యంలో ఒడిశాలోని ప్రెస్క్లబ్లో ‘పచ్చని భవిష్యత్ దిశగా పునర్నిర్మాణం’ అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించారు.