WGL: పర్వతగిరి మండలం హాక్యా తండా కెనాల్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు వందల సంఖ్యలో చనిపోయిన ఫారం కోళ్లను పడేసి పోయారు. దీంతో స్థానికులకు దుర్వాసన రావడంతో పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ శాఖ వారు బుధవారం ఘటనను పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రపరచాలని డాక్టర్ బాలకృష్ణ ఆదేశించారు. కోళ్లను పడేసిన వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు.
WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం–అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 51వ డివిజన్లో రూ.1.17 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
జనగామ జిల్లాకి నూతనంగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గంలోని పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ని కోరారు. కలెక్టర్ సైతం సానుకూలంగా స్పందించారు.
PDPL: జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు బుధవారం పెద్దపల్లిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అమలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ.. జిల్లాలో కార్యక్రమం విజయవంతనికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
MHBD: మరిపెడ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం చిన్నారులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ హాజరై అంగన్వాడి పిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య వంటి అంశాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటుందన్నారు.
VKB: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన దోమ మండల పరిధిలోని బుద్దాలాపూర్ గ్రామ సమీపంలో జరిగింది. ఎస్సై వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బుద్దాలాపూర్ గ్రామానికి చెందిన జర్పుల భీమ్లా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నాడు. పోలీసులు తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లభించలేదు దీంతో ట్రాక్టర్ను PSకు తరలించారు.
BDK: పాల్వంచ నగరపాలక 41వ డివిజన్లో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం మేయర్ గణేష్ చౌవాన్ పర్యటించారు. వారితోపాటు 41వ డివిజన్ కార్పొరేటర్ అన్నపూర్ణ పాల్గొన్నారు. స్థానిక అధికారులు అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మేయర్ ఆదేశించారు. స్వచ్ఛమైన, శుభ్రమైన నగరాలు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం అని వెల్లడించారు.
ASF: జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హరిత గారు ఐడీఓసీ (IDOC) సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేయాలని, బాధితులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, పోలీస్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
KMM: నేలకొండపల్లి మండలంలో ఈ నెల 6న ఇంటర్ పరీక్షలు రాసి వస్తుండగా జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల్లో కొరట్లగూడెం గ్రామానికి చెందిన అభిరాం బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నేలకొండపల్లి మండలం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
VKB: సర్వేయర్లుగా శిక్షణ ఇచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చి వారికి జీతాలు ఇవ్వాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. వికారాబాద్ మండలంలో శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లు మాజీ ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి శిక్షణ ఇచ్చిన ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు.
GDWL: రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి మధుబాబు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, స్త్రీల వ్యాధులు, శిశువుల ఆరోగ్యం, ఎముకలు కీళ్ల సమస్యల నిపుణులు రోగులను పరీక్షిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
HYD: తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పురుషుల, మహిళల త్రోబాల్ జట్లకు యూసఫ్గూడలో ప్లేయింగ్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు. మార్చి 13-15 వరకు తిరుపతిలో జరిగే 34వ ఫెడరేషన్ కప్, 17వ సౌత్ జోన్ త్రోబాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ జట్లు పాల్గొననున్నాయి.
ADB: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్యాల కరుణాకర్ బుధవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. మండల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రికి విన్నవించారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. భారత్ జూడో యాత్రికుడు జాంటీ, నాయకులు తదితరులున్నారు.
VKB: బొంరాస్పేట మండల వ్యాప్తంగా రేషన్ షాపుల్లోనే దొడ్డు బియ్యం నిల్వలు మగ్గిపోతోన్నా వాటిని పట్టించుకునేవారే కరవయ్యారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ప్రస్తుతం సన్నబియ్యాన్ని అందిస్తుంది. అయితే అంతకుముందు అందించిన దొడ్డు బియ్యం నిల్వలు అలాగే ఉండడంతో వాటికి పురుగులు పట్టి పాడవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించలని ప్రజలు కోరుతున్నారు.
JN: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నెల్లుట్ల గ్రామం నుంచి లింగాల ఘనపూర్ వెళ్లే రహదారిలో గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను జేసీబీలతో క్లీన్ చేయించారు. గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ… గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని, గ్రామంలోని ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.