• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పదో తరగతి పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు పూర్తి: MEO

BHPL: ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రేగొండ MEO ప్రభాకర్ ఇవాళ తెలిపారు. మండలంలో మొత్తం 2 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ZPHS రంగయ్యపల్లిలో 120 మంది, ZPHS రేగొండలో 220 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 340 మంది విద్యార్థలు పరీక్షలు రాయనున్నట్లు MEO ప్రభాకర్ వెల్లడించారు.

March 11, 2026 / 01:05 PM IST

మృతరాలికి నివాళి అర్పించిన బీజేపీ నాయకులు

WGL: నర్సంపేట పట్టణ బీజేపీ సీనియర్ నాయకులు మల్యాల సాంబమూర్తి భార్య శ్రీదేవి అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణా ప్రతాప్ రెడ్డి శ్రీదేవి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. అనంతరం మృతిరాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 11, 2026 / 01:05 PM IST

మృతురాలికి నివాళి అర్పించిన బీజేపీ నాయకులు

WGL: నర్సంపేట పట్టణ బీజేపీ సీనియర్ నాయకులు మల్యాల సాంబమూర్తి భార్య శ్రీదేవి అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణా ప్రతాప్ రెడ్డి శ్రీదేవి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 11, 2026 / 01:05 PM IST

బీజేపీ ద్వంద వైఖరి మాటలను ఖండిస్తున్నాం: కాంగ్రెస్

WNP: జూరాల వద్ద నిర్మిస్తున్న నూతన హై లెవల్ బ్రిడ్జి విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం గెస్ట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రహమతుల్లా, ఛైర్ పర్సన్ నాగమణి మాట్లాడారు.

March 11, 2026 / 01:03 PM IST

ఆలయ బ్రహ్మోత్సవాల ప్రచార రథాన్ని ప్రారంభించిన ఛైర్మన్

KMM: ఖమ్మం యూపీహెచ్ కాలనీ అభయ వేంకటేశ్వరస్వామి దేవస్థాన 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల ప్రచార రథాన్ని ఛైర్మన్ అల్లిక అంజయ్య ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని, అన్నదానానికి విరాళాలు అందించి సహకరించాలని కోరారు.

March 11, 2026 / 01:02 PM IST

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి

NLG: చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన కోరమోని శ్రీనుకు మంజూరైన రూ. 60,000 ల సీఎం సహాయ నిధి చెక్కును ఆ గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ బుధవారం అందించారు. పరిస్థితిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి సర్పంచ్ తీసుకెళ్లగా చెక్కును మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆరూరి రాములు, శ్రీనివాస్, శ్రీను, అశోక్, ధనయ్య, నర్సింహా పాల్గొన్నారు.

March 11, 2026 / 01:01 PM IST

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

NLG: చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన కోరమోని శ్రీనుకు మంజూరైన రూ. 60,000 ల సీఎం సహాయ నిధి చెక్కును ఆ గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ బుధవారం అందించారు. పరిస్థితిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి సర్పంచ్ తీసుకెళ్లగా చెక్కును మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆరూరి రాములు, శ్రీనివాస్, శ్రీను, అశోక్, ధనయ్య, నర్సింహా పాల్గొన్నారు.

March 11, 2026 / 01:01 PM IST

మార్కెట్లో తగ్గిన పత్తి క్రయవిక్రయాలు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 18 వాహనాల్లో 82 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా. గరిష్ఠంగా క్వింటాకు రూ. 7,490, కనిష్ఠంగా రూ.7,000 ధరకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత కార్యదర్శి రాజా పరిశీలించారు.

March 11, 2026 / 01:00 PM IST

‘కోనోకార్పాస్ చెట్ల పెంపకం… తొలగించని అధికారులు’

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డు డివైడర్ మధ్యలో పెరిగిన కోనోకార్పాస్ చెట్ల వలన శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ మొక్క చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో.. మనుషులకు కూడా అంతే కీడు చేస్తుందని ప్రచారం. అధికారులు తక్షణమే స్పందించి కోనో కార్పాస్ చెట్లను తొలగించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

March 11, 2026 / 01:00 PM IST

వాటర్ ట్యాంకును పరిశీలించిన జిల్లా కలెక్టర్

KMR: సదాశివనగర్ మండల కేంద్రంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును పరిశీలించారు. స్వయంగా ట్యాంకు పైకి వెళ్లి లోపల పరిశుభ్రతను తనిఖీ చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ట్యాంకును తప్పనిసరిగా శుభ్రం చేయాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని కోరారు.

March 11, 2026 / 12:59 PM IST

‘స్క్రీన్ టైమ్ తగ్గించి, గ్రౌండ్ టైమ్ పెంచాలి’

HYD: సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ABVP ఆధ్వర్యంలో ‘స్క్రీన్ టైమ్ టూ గ్రౌండ్ టైమ్’ పేరుతో ఖేలో భారత్ క్రీడలు నిర్వహించారు. ఈమేరకు బుధవారం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు జనారెడ్డి, బేగంపేట్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ హాజరయ్యారు. యువత స్క్రీన్ టైమ్ తగ్గించి, గ్రౌండ్ టైమ్, యాక్టివిటీ టైమ్ పెంచుకోవాలన్నారు.

March 11, 2026 / 12:49 PM IST

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

BDK: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువలను బుధవారం MLA ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆరేం ప్రియాంక, ఉప సర్పంచ్ కిరణ్, మండల అధ్యక్షుడు సైదులు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రాంబాబు పాల్గొన్నారు.

March 11, 2026 / 12:49 PM IST

‘జనాభా లెక్కల సేకరణను పకడ్బందీగా నిర్వహించాలి’

MNCL: జనాభా లెక్కలను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సూచించారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని ఐ డాక్ కార్యాలయంలో జిల్లాలోని అధికారులకు జనాభా లెక్కల పై గురించి మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణలో జనాభా లెక్కల సేకరణ రెండు విడతలుగా జరుగుతుందన్నారు. జనాభా లెక్కలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

March 11, 2026 / 12:47 PM IST

రంజాన్ వేడుకలకు సిద్ధం చేయాలి: అనన్య

VKB: రంజాన్ వేడుకలకు ఈద్గాలు, దర్గాల పరిసరాలు పరిశుభ్రం చేసి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని వికారాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం అనన్య ఆదేశించారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి ఈద్గా, దర్గాని స్థానిక కౌన్సిలర్లు, అధికారులతో కలిసి పరిశీలించారు. పండగ వేడుకలు నిర్వహించేలా తన సౌకర్యాలు కల్పించి ఏర్పాట్లు సిద్ధం చేయాలని తెలిపారు.

March 11, 2026 / 12:46 PM IST

గ్రామ సమైక్య సంఘాల భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ

MNCL: మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జైపూర్ మండలం ఇందారంలో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి గ్రామైఖ్య సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఈ క్రమంలో రూ. 30 లక్షల వ్యయంతో3 సమైక్య సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు.

March 11, 2026 / 12:45 PM IST