• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పీడీఎస్‌యు 23వ మహాసభల వాల్ పోస్టర్ విడుదల

GDWL: నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వాలే విద్యను నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నాయి అని పీడీఎస్‌యు జిల్లా అధ్యక్షుడు హరీష్ పేర్కొన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో పీడీఎస్‌యు రాష్ట్ర 23వ మహాసభల పోస్టర్‌ను సంఘం నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సభలు విద్యార్థుల పక్షంలో ఉంటుందన్నారు.

January 19, 2026 / 07:03 PM IST

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలి: ఎమ్మెల్యే

SRCL: SRCL: మహిళలు ఆకాశమే హద్దు కావాలన్న తత్వంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో జిల్లాలోని 1,295 SHGలకు మొత్తం రూ. 4 కోట్లు 64 లక్షలు 68,771 విలువల చెక్కులను వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి అందజేశారు.

January 19, 2026 / 07:02 PM IST

రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి: ఏసీపీ

KMM: రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ఉంటాయని ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు. ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, హెల్మెట్, సీటుబెల్టు వాడకంలో అలసత్వం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

January 19, 2026 / 07:02 PM IST

జాతీయస్థాయి పోటీలకు ఆదర్శ కళాశాల విద్యార్థిని ఎంపిక

PDPL: ధర్మారం తెలంగాణ ఆదర్శ పాఠశాల & కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న జైనపురం త్రిష జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. గుజరాత్‌లోని సోమనాథ్‌లో ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగే 69వ SGF పోటీలలో తెలంగాణ తరఫున పాల్గొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజ్ కుమార్, పీఈటీలు కొమురయ్య, సంజీవరావు త్రిషను అభినందించారు.

January 19, 2026 / 07:02 PM IST

మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరికలు

NRPT: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు చెందిన ఎరుకలి శివరాజ్ ఆధ్వర్యంలో చందాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 20 మంది కార్యకర్తలు సోమవారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మక్తల్ మున్సిపాలిటీలో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలన్నారు.

January 19, 2026 / 07:00 PM IST

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి: మాజీ డీసీసీ అధ్యక్షురాలు

MNCL: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని మంచిర్యాల జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు కోరారు. సోమవారం లక్షెట్టిపేట మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మహిళలకు పీఎస్ఆర్ బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుమ్మని సత్తయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

January 19, 2026 / 06:58 PM IST

రాబందులను దరిదాపుల్లో రానివ్వం: డిప్యూటీ సీఎం

KMM: మధిరలో వంద పడకల ఏరియా ఆసుపత్రిని సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న సంపదను పెంచుతాం పేద ప్రజలకు పంచుతాం డేగలను రాబందులను దరిదాపుల్లో కూడా రానివ్వమని డిప్యూటీ సీఎం స్పష్టంగా హెచ్చరించారు. మహిళా ఆర్థికంగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం ముందుండి సహాయ సహకారాలు అందజేస్తుందని వెల్లడించారు.

January 19, 2026 / 06:58 PM IST

జిల్లా కార్యనిర్వాహక సమావేశంలో పాల్గొన్న జ్యోతి భీమ్ భరత్

RR: ఇవాళ గాంధీ భవన్‌లో జరిగిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లాల కార్యనిర్వాహక సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

January 19, 2026 / 06:58 PM IST

బస్టాండ్‌లో పోలీసుల పహారా.. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహణ

WGL: పండుగ సెలవులు ముగియడంతో పాటు మేడారం, వేములవాడకు భక్తుల రద్దీ పెరగడంతో వరంగల్ బస్ స్టాండ్‌లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇంతేజార్‌గంజ్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా గస్తీ చేపట్టారు. చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

January 19, 2026 / 06:55 PM IST

వడ్డీ లేని రుణాలు చెక్కులు పంపిణీ చేసిన షబ్బీర్ అలీ

కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియం సోమవారం 582 సంఘాలకు ₹1.91 కోట్ల చెక్కులను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక ఎదుగుదలే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో జరిగిన వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమం మహిళ లోకంలో కొత్త ఉత్సాహం నింపిందని పేర్కొన్నారు.

January 19, 2026 / 06:54 PM IST

రాజాపేట మండలాధ్యక్షుడికి గొంగిడి మహేందర్ రెడ్డి పరామర్శ

BHNG: బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్‌కు ఇటీవల ప్రమాదవశాత్తు చేతులకు మంట అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం విషయం తెలుసుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తిరుమలేష్‌ను పరామర్శించి ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి తదితరులు ఉన్నారు.

January 19, 2026 / 06:54 PM IST

ఆర్గానిక్ పసుపు పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్

NZB: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్గానిక్ పసుపు పంటకు విస్తృత స్థాయిలో డిమాండ్ ఉన్నందున సేంద్రీయ విధానంలో పసుపు పంట సాగుపై దృష్టిని కేంద్రీకరించాలని MP అరవింద్ ధర్మపురి, కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు పిలుపునిచ్చారు. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

January 19, 2026 / 06:54 PM IST

అలంపూర్ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి అని ఆలయ ఈవో దీప్తి రెడ్డి తెలిపారు. సోమవారం బ్రహ్మోత్సవాల ఆరంభోత్సవంలో భాగంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి ఆనతి స్వీకరణతో మొదలై, విఘ్నేశ్వరుని ఆశీస్సుల కోసం మహా గణపతి పూజ, ఋత్విక్ వరుణము, శక్తిమంతమైన మహా కలశ స్థాపన వంటి వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

January 19, 2026 / 06:54 PM IST

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి

SRCL: చందుర్తి మండల కేంద్రంకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సోమవారం మండల కేంద్రానికి చెందిన చెందిన మర్రి మల్లేశం (46) , బుర్ర లక్ష్మీదేవి ( 69) అనారోగ్యంతో మృతి చెందగా, ఏనుగుల రాజయ్య ( 70) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతి చెందిన వారి కుటుంబీకులు, బంధువులు కన్నీరు పర్యంతమయ్యారు.

January 19, 2026 / 06:53 PM IST

గ్రామపాలనలో సర్పంచ్‌లు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి: కలెక్టర్

KMM: గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవిని ఒక హోదాగా కాకుండా బాధ్యతగా తీసుకుని, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఖమ్మం TTDC సమావేశ మందిరంలో జరిగిన నూతన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

January 19, 2026 / 06:53 PM IST