BHPL: ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రేగొండ MEO ప్రభాకర్ ఇవాళ తెలిపారు. మండలంలో మొత్తం 2 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ZPHS రంగయ్యపల్లిలో 120 మంది, ZPHS రేగొండలో 220 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 340 మంది విద్యార్థలు పరీక్షలు రాయనున్నట్లు MEO ప్రభాకర్ వెల్లడించారు.