KMR: నిజాంసాగర్ ప్రధాన కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. బుధవారం కాలువలో కొట్టుకొని వచ్చిన శవాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి వయస్సు సుమారు 65 సంవత్సరాలు, ఎత్తు ఐదు అడుగులు, చామనచాయ రంగు, కోల ముఖం ఉందని తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.